Husband Assassinated Wife on Marriage Day in Karnataka - Sakshi
Sakshi News home page

భార్యకి పెళ్లి రోజు కానుక.. బాత్‌రూమ్‌లో గొయ్యి తవ్వి..

Jan 8 2022 6:59 AM | Updated on Jan 8 2022 7:59 PM

Husband Assassinated Wife On Marriage Day Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యశ్వంతపుర/ చెళ్లకెరె రూరల్‌: పెళ్లి రోజున కానుకలు ఇవ్వాల్సిన భర్త  భార్య ప్రాణం తీశాడు. వివరాలు..చిత్రదుర్గ తాలూకా కోణనూరు గ్రామంలో సుమ (26), నారప్ప దంపతులు నివాసం ఉంటున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 25న వీరి పెళ్లి రోజు. అదే రోజు నారప్ప భార్యను హత్య చేసి బాత్‌రూమ్‌లో గొయ్యి తవ్వి ప్లాస్టింగ్‌ చేసి ఉంచాడు. భార్య కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటికి వచ్చి తనిఖీ చేయగా మృతదేహం బయటపడింది. తానే హత్యచేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఇతనిపై వరకట్న వేధింపులు, హత్య కేసు నమోదు చేశారు.  (చదవండి: ఎన్నో కలలతో మెట్టినింట కాలు మోపింది.. ఏడాదిన్నర కాకుండానే.. )

మరో ఘటనలో..

కామాంధుడికి పదేళ్ల జైలు 
కోలారు: బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 15 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివరాలు... 2019 జనవరి 17న ముళబాగిలు తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన గంగాధర్‌ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని పలమనేరులో బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేసి కోర్టుకు చార్జ్‌షీట్‌ సమర్పించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పదేళ్ల జైలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి బీపీ దేవెమానే శుక్రవారం తీర్పు వెలువరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement