ప్రముఖ నగల వ్యాపారి కాల్చివేత | Goldsmith Shot Dead By Terrorists In Jammu And Kashmir | Sakshi
Sakshi News home page

ప్రముఖ నగల వ్యాపారి కాల్చివేత

Jan 1 2021 2:46 PM | Updated on Jan 1 2021 3:19 PM

Goldsmith Shot Dead By Terrorists In Jammu And Kashmir - Sakshi

శ్రీనగర్‌: నూతన సంవత్సరం తొలి రోజే  శ్రీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది.  స్థానిక బిజీ మార్కెట్లో వ్యాపారి సత్పాల్ సింగ్ (62) పై ఉగ్రవాదులు  కాల్పులు జరిపారు.  తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. సారాయ్ బాలా వద్ద  గురువారం ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు.  ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టతలేదు.  సింగ్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Advertisement
 
Advertisement
Advertisement