Vemulawada Temple: వేములవాడ రాజన్న సన్నిధిలో విషాదం.. క్యూ లైన్‌లోనే కుప్పకూలి..

Devotee Died With Heart Attack At Rajanna Temple - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. రాజన్న దర్శనం కోసం వచ్చిన ఓ భక్తురాలు.. క్యూ లైన్‌ కుప్పకూలి కన్నుమూసింది. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

కరీంనగర్‌ లింగాపూర్‌కు చెందిన లక్ష్మి తన కుటుంబంతో సోమవారమే రాజన్న ఆలయ సన్నిధికి చేరుకుంది. అయితే.. దర్శనం కోసం ఇవాళ వేకువఝామున ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్‌లో నిల్చున్నారు. ఈ క్రమంలో తనకు అస్వస్థతగా ఉందని చెబుతూనే ఆమె కుప్పకూలిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

లక్ష్మిని పరిశీలించిన వైద్యులు.. ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించారు. ఆలయ ప్రాంగంలోనే ఆమె కన్నుమూయడం, లక్ష్మి కూతురి రోదనలు చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top