పోలీస్‌ శిబిరంపై బాంబు దాడి: 13 మంది పోలీసులు దుర్మరణం

Bomb Attack On Police Check Post In Iraq: Suspected IS - Sakshi

పోలీస్‌ చెక్‌పోస్టుపై బాంబు దాడి

ఇరాక్‌లోని అల్‌రషద్‌లో ఘటన

బాగ్దాద్‌: ఐసిస్‌ ఉగ్రదాడులు రెచ్చిపోయారు. తమ ఆట కట్టించేందుకు పని చేస్తున్న పోలీసులను మట్టుబెట్టారు. పోలీసులే లక్ష్యంగా బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 13 మంది పోలీసులు కన్నుమూశారు. దీంతో ఇరాక్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆ దేశంలోని కిర్కుక్‌ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలోని అల్‌ రషద్‌ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న ఫెడరల్‌ పోలీస్‌ చెక్‌పోస్టుపై ఇస్లామిక్‌ స్టేట్‌ ఆర్గనైజేషన్‌ ఉగ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో భద్రతా దళాలకు చెందిన 13 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారని ఆ దేశ భద్రత అధికారి వెల్లడించారు. వారి దాడుల నేపథ్యంలో ఆ దేశంలో హై అలర్ట్‌ ప్రకటించారు.

చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్‌ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top