
శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం రాహుకాల అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాహుకాల సమయం 10.30 నుంచి 12 గంటల వరకు అర్చనలు, అభిషేక పూజలు చేశారు. శ్రావణమాసపు చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
బోయకొండలో ప్రత్యేక పూజలందుకున్న అమ్మవారు, ఆలయంలో భక్తుల రద్దీ

శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు