జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

Aug 10 2025 5:52 AM | Updated on Aug 10 2025 5:52 AM

జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

చిత్తూరు అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే ఈ కార్డెన్‌ సెర్చ్‌ పేరిట తనిఖీలు చేపట్టారు. నేరాలను ముందస్తుగా గుర్తించి అరికట్టడమే కార్డెన్‌ సెర్చ్‌ లక్ష్యమని చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. వాహనాల తనిఖీ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తించడం, అసాంఘి కార్యకలాపాలు నిరోధించడానికి ఇలాంటి తనిఖీలు ఉపయోగపడుతాయన్నారు. ఈ తనిఖీల్లో జిల్లాలో సరైన రికార్డులు లేనటువంటి 11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, 30 కర్ణాటక మద్యం ప్యాకెట్లను సీజ్‌ చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని ఏఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement