
బోయకొండ కిటకిట
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తజన సందోహంతో పోటెత్తింది. సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అర్చకులు అమ్మవారిని అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు దీపాలు వెలిగించి , బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. క్యూలెన్లో భక్తుల రద్దీతో తోపులాట చోటుచేసుకున్నాయి. భక్తులకు ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.