బోయకొండ కిటకిట | - | Sakshi
Sakshi News home page

బోయకొండ కిటకిట

Aug 4 2025 3:22 AM | Updated on Aug 4 2025 3:22 AM

బోయకొండ కిటకిట

బోయకొండ కిటకిట

చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తజన సందోహంతో పోటెత్తింది. సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అర్చకులు అమ్మవారిని అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు దీపాలు వెలిగించి , బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. క్యూలెన్‌లో భక్తుల రద్దీతో తోపులాట చోటుచేసుకున్నాయి. భక్తులకు ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement