వచ్చామా..చెప్పామా.. వెళ్లామా! | - | Sakshi
Sakshi News home page

వచ్చామా..చెప్పామా.. వెళ్లామా!

Apr 30 2025 12:22 AM | Updated on Apr 30 2025 12:22 AM

వచ్చామా..చెప్పామా.. వెళ్లామా!

వచ్చామా..చెప్పామా.. వెళ్లామా!

● మళ్లీ తూతూమంత్రంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం ● అన్ని శాఖల్లోనూ నామ మాత్రంగా చర్చ ● సమావేశానికి ఇన్‌చార్జ్‌ మంత్రి, ఎమ్మెల్యేలు డుమ్మా

పొంతన లేని అజెండా.. చర్చ

సర్వసభ్య సమావేశంలో స్టేజీపైనా పలు శాఖల అధికారులు ప్రసంగించిన అంశాలు.. అజెండాలోని అంశాలకు పూర్తిగా వ్యత్యాసం ఉండడంతో సభ్యులు తికమకపడ్డారు. అజెండాలో పలు శాఖలు ఇచ్చిన వివరాలు రెండు నెలలు ముందువే కావడంతో సభ్యులు ఇదేమి తీరని మండిపడ్డారు. సభ్యులకు తాజా సమాచారం ఇవ్వకుండా మోసం చేయటమేమిటని ప్రశ్నించారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి, అన్నమయ్య జిల్లాల సమాచారాన్ని సభ్యులకు తెలియజేయకుండా కేవలం చిత్తూరు జిల్లాలో 32 మండలాల సమాచారాన్నే వివరించడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు కార్పొరేషన్‌: వచ్చామా.. ఏదో చెప్పామా..వెళ్లామా అనే చందాన తూతూమంత్రంగా సాగింది జిల్లా పరిషత్‌ మూడో సర్వసభ్య సమావేశం. జెడ్పీ సమావేశ మందిరంలో మూడో సర్వసభ్య సమావేశం మంగళవారం చైర్మన్‌ శ్రీనివాసులు అధ్యక్షతన, సీఈఓ రవికుమార్‌నాయుడు నేతృత్వంలో నిర్వహించారు. జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ మండలాల వారీగా తాగునీటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తాగునీటి స మస్యను పరిష్కారానికి పెద్దపీట వేశామన్నారు. ఎక్కడైన మండలాల్లో బోర్లు, మోటార్లు పాడైతే తమ దృష్టికి తీసుకురావలన్నారు. వెంటనే వాటిని మరమ్మతు చేయడానికి అనుమతులు ఇస్తామన్నారు. అలాగే కు రబ సంఘం నాయకుల వినతి మేరకు జెడ్పీ కార్యాలయంలో కనకదాస్‌ విగ్రహం ఏర్పాటుపై సభ్యుల నుంచి తీర్మానం స్వీకరించారు.

వ్యయం రూ.3.888 కోట్లు

సర్వసభ్య సమావేశం చివర్లో బడ్జెట్‌ ఆమోదంపై తీ ర్మానం చేశారు. ఈ బడ్జెట్‌ ఆమోదంలో 2025–26 వ ఆర్థిక సంవత్సర వ్యయం రూ.3,888 కోట్లుగా ప్ర కటించారు. అలాగే ఆదాయం రూ.3,996 కోట్లుగా నిర్ధేశించినట్లు జెడ్పీ సీఈఓ రవికుమార్‌ నాయుడు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనా ఆదాయం రూ.4133 కోట్లుగా, వ్యయం రూ.4,039 కోట్లుగా నిర్ధేశించారు. అయితే నిర్ధేశించిన అంచనాలకంటే తక్కువగా ఈ సంవత్సరం బడ్జెట్‌ నమోదైంది.

దళిత ఎమ్మెల్యేకు అవమానం

సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలాన్ని నియోజకవర్గంలో అధికారులు అవమానిస్తున్నారని ఆయన కు మారుడు నారాయణవనం జెడ్పీటీసీ సభ్యుడు సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమూల్‌ డెయిరీ పరిస్థితి ఏమిటి?

గతంలో అమూల్‌ డెయిరీలో పాల ధర బాగా ఇచ్చేవారని మదనపల్లె జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్‌కుమార్‌ అన్నారు. ప్రస్తుతం దాదాపు అక్కడ పాలసేకరణ ఆపి వేసినట్లు తెలిసిందన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన డెయిరీ కావడంతో దానిపై కక్షకట్టి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని విమర్శించారు.

ఫలితాలు తుస్‌

పది, ఇంటర్‌ తరగతుల ఫలితాలు గతం కంటే త గ్గాయని శాంతిపురం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు అన్నారు. పేద, మధ్యతరగతి పిల్లలు ప్రభు త్వ బడుల్లో చదువుకుంటున్నారన్నారు. కానీ అక్కడ ఫలితాలు చూస్తే భయమేస్తోందన్నారు.

ఆర్‌ఎంపీలదే రాజ్యం

కుప్పం నియోజకవర్గంలో ఆర్‌ఎంపీ వైద్యులదే రా జ్యంగా మారిందని కుప్పం జెడ్పీటీసీ సభ్యుడు శరవ ణ ఆరోపించారు. 108 వాహనంలో వసతులు లేవని పాకాల జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి తెలిపారు. సదుం మండలంలోని జెడ్పీ హైస్కూల్‌లో అనవసరంగా నిర్మిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి ఆరోపించారు. గుడుపల్లె మండంలోని పలు పాఠశాలల పనులు మధ్యలో ఆగిపోయాయని జెడ్పీటీసీ సభ్యుడు కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. పీలేరు మండలంలో ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైతే రేణిగుంటకు వెళ్లి తెచ్చుకోవడానికి రైతులు అవస్థలు పడుతున్నారని ఎ ర్రావారిపాళెం జెడ్పీటీసీ సభ్యుడు కరుణాకర్‌రెడ్డి అ న్నారు. సోలార్‌ అదనపులోడ్‌ క్రమబద్ధీకరణకు రెస్కో అధికారులు డబ్బులు కట్టించుకుని, ఇవ్వలేదని రామకుప్పం జెడ్పీటీసీ సభ్యుడు నితిన్‌రాఘవ్‌ తెలిపారు. పాలసముద్రం మండలంలో కరెంటు స్తంభాలు వాలిపోయాయని పాలసముద్రం జెడ్పీటీసీ అన్బలగన్‌ తెలి పారు. వికృతమాల పంచాయతీలో జరిగిన పలు పను ల్లో రూ.2 కోట్లు అవినీతి జరిగిందని ఏర్పేడు జెడ్పీటీసీ సభ్యుడు తిరుమలయ్య ఆరోపించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, తిరుపతి డీఆర్వో నరసింహులు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రమ్య తదితరులు పాల్గొన్నారు. కాగా జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి సభ్యులు కానీ వారు హాజరయ్యారు. అలాగే జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్‌ వ్యక్తిగత కెమెరామెన్‌ వీడియో తీస్తూ హల్‌చల్‌ చేశారు.

మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు

ప్రభుత్వాస్పత్రులు అధ్వాన్నం: ఎమ్మెల్యే థామస్‌

జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు అధ్వాన్నంగా ఉన్నాయని జీడీ నెల్లూరు కూటమి ఎమ్మెల్యే థామస్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే థామస్‌ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఇటీవల తలకు దెబ్బతగిలి ఒక మహిళ చేరితే సీటీ స్కాన్‌ చేయకుండా పంపేశారన్నారు. మరుసటి రోజు ఆమె మరణించిందన్నారు. కాగా సర్వ సభ్య సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు జెడ్పీటీసీ సభ్యులు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రశ్నల వర్షం కురిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement