ఖజానా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరేష్‌బాబు | - | Sakshi
Sakshi News home page

ఖజానా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరేష్‌బాబు

Apr 29 2025 7:07 AM | Updated on Apr 29 2025 7:07 AM

ఖజానా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరేష్‌బాబు

ఖజానా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరేష్‌బాబు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఖజానా, లెక్కల శాఖ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి.నరేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ ఉద్యోగ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నరేష్‌బాబు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన చిత్తూరు జిల్లా ఖజానా సంఘం ఉపాధ్యక్షుడిగా 2008 నుంచి 2011 వరకు మూడేళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర సంఘ అడహాక్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన్ని జిల్లా అధ్యక్షుడు చెంగల్రాయుడు, కార్యదర్శి పయణి, కోశాధికారి చలపతి, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement