
ఖజానా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నరేష్బాబు
చిత్తూరు కలెక్టరేట్ : ఖజానా, లెక్కల శాఖ ఉద్యోగ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి.నరేష్బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ ఉద్యోగ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నరేష్బాబు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన చిత్తూరు జిల్లా ఖజానా సంఘం ఉపాధ్యక్షుడిగా 2008 నుంచి 2011 వరకు మూడేళ్లపాటు పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర సంఘ అడహాక్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆయన్ని జిల్లా అధ్యక్షుడు చెంగల్రాయుడు, కార్యదర్శి పయణి, కోశాధికారి చలపతి, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు అభినందించారు.