1నుంచి టీసీఎస్‌ బైబ్యాక్‌ | Sakshi
Sakshi News home page

1నుంచి టీసీఎస్‌ బైబ్యాక్‌

Published Thu, Nov 30 2023 4:38 AM

Tata Consultancy Services Buyback updates - Sakshi

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్‌(టీసీఎస్‌).. సొంత ఈక్విటీ షేర్ల కొను గోలు(బైబ్యాక్‌)ను డిసెంబర్‌ 1నుంచి ప్రారంభించనుంది. షేరుకి రూ. 4,150 ధర మించకుండా 1.12 శాతం ఈక్విటీకి సమానమైన 4.09 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 17,000 కోట్లవరకూ వెచి్చంచనుంది.  బైబ్యాక్‌లో భాగంగా రూ. 2 లక్షల పెట్టుబడిలోపుగల చిన్న ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 6 షేర్లకుగాను 1 షేరుని తీసుకోనుంది.

ఇందుకు రికార్డ్‌ డేట్‌ నవంబర్‌ 25కాగా.. ఇతర సంస్థాగత ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 209 షేర్లకుగాను 2 షేర్లను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ షేర్ల తాజా బైబ్యాక్‌ ప్రభావం కంపెనీ లాభదాయకత లేదా ఆర్జనపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది. బైబ్యాక్‌ కారణంగా పెట్టుబడులకు వినియోగించగల నిధులు మాత్రమే ఆమేర తగ్గనున్నట్లు వివరించింది. వెరసి కంపెనీ వృద్ధి అవకాశాలకు ఎలాంటి విఘాతం కలగబోదని స్పష్టం చేసింది.  

ప్రమోటర్ల వాటా..
టీసీఎస్‌లో ప్రమోటర్‌ టాటా సన్స్‌ 72.27 శాతానికి సమానమైన 26.45 కోట్ల షేర్లను కలిగి ఉంది. వీటిలో బైబ్యాక్‌కు 2.96 కోట్ల షేర్లను దాఖలు చేయనుంది. ఇక టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ తమవద్ద గల 10,14,,172 షేర్లలో 11,358 షేర్లను టెండర్‌ చేయనుంది. టీసీఎస్‌ మొత్తం 4,09,63,855 షేర్లను బైబ్యాక్‌ చేసే లక్ష్యంతో ఉంది. బైబ్యాక్‌కు పూర్తిస్థాయిలో షేర్లు దాఖలైతే కంపెనీలో ప్రమోటర్ల వాటా ప్రస్తుత 72.3 శాతం నుంచి 72.41 శాతానికి బలపడనుంది. కాగా.. బైబ్యాక్‌ పూర్తయిన తదుపరి ఏడాదివరకూ టీసీఎస్‌ మూలధన సమీకరణ చేపట్టబోదు.

గతేడాది సైతం షేరుకి రూ. 4,500 ధరలో ఈక్విటీ బైబ్యాక్‌కు రూ. 18,000 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. అంతక్రితం 2020, 2018, 2017లలో సైతం బైబ్యాక్‌లకు సుమారు రూ. 16,000 కోట్లు చొప్పున పెట్టుబడులను వెచి్చంచడం విశేషం! కంపెనీ తొలిసారి 2017లో మార్కెట్‌ ధరకంటే 18 శాతం అధిక ధరలో షేర్ల కొనుగోలుకి తెరతీసింది. ఆపై 18–10 శాతం మధ్య ప్రీమియంలో బైబ్యాక్‌లను పూర్తి చేసింది. 2022 బైబ్యాక్‌కు 17 శాతం అధిక ధరను చెల్లించింది. తాజా బైబ్యాక్‌ తదుపరి షేరువారీ ఆర్జన(ఈపీఎస్‌) రూ. 58.52 నుంచి 59.18కి మెరుగుపడనుంది.  
ఈ నేపథ్యంలో టీసీఎస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.3 శాతం లాభపడి రూ. 3,515 వద్ద ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement