Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Fri, Apr 5 2024 9:26 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,457కు చేరింది. సెన్సెక్స్‌ 178 పాయింట్లు పుంజుకుని 74,049 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 90.8 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.23 శాతం నష్టాలతో, నాస్‌డాక్‌ 1.4 శాతం దిగజారాయి.

రూపాయికి అనుసంధానమైన ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ కరెన్సీ డెరివేటివ్స్‌ (ఈటీసీడీ)పై ఆదేశాల అమలును మే 3కు వాయిదా వేసినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. పలువురు వాటాదార్ల నుంచి వచ్చిన స్పందనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు ఏప్రిల్‌ 5 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, వాయిదా పడ్డాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement