సాక్షి మనీ మంత్ర: రోజంతా ఒడుదొడుకులు.. స్వల్ప లాభాలతో ముగింపు.. | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: రోజంతా ఒడుదొడుకులు.. స్వల్ప లాభాలతో ముగింపు..

Feb 29 2024 4:17 PM | Updated on Feb 29 2024 4:17 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నా చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్‌ ముగింపు సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 21,982 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 195 పాయింట్లు ఎగబాకి 72,500 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, పవర్‌గ్రిడ్‌, మారుతి సుజుకీ, ఎస్‌బీఐ, టైటాన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే కంపెనీ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌యూఎల్‌, భారతిఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ స్టాక్‌లు నష్టాల్లోకి చేరుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 83.54 డాలర్ల వద్దకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) బుధవారం నికరంగా రూ.1,879.23 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.1,827.45 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement