దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీతా పతనమయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య రియల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ క్షీణించడంతో భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు గణనీయంగా క్షీణించాయి.
నిఫ్టీ 1.22 శాతం లేదా 311.85 పాయింట్ల నష్టంతో 25,178.65 వద్ద, సెన్సెక్స్ 961.42 పాయింట్లు లేదా 1.17 శాతం నష్టపోయి 81,287.19 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు భారీగా పడిపోయాయి.
విస్తృత మార్కెట్లు కూడా బెంచ్ మార్క్ సూచీలకు అనుగుణంగా పడిపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.14 శాతం, 1.10 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు అత్యధికంగా క్షీణించాయి. ఈ సూచీలు వరుసగా 2.3 శాతం, 2.1 శాతం నష్టపోయాయి.


