stockmarket: లాభాల జోరు, మెటల్‌ షైన్‌

 Sensex Rises Rises 400 Points - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ఆరంభంలోనే  పాజిటివ్‌ ఉత్సాహాన్నిచ్చాయి.  భారీ లాభాల జోరును రోజంతా కంటిన్యూ చేశాయి.  దాదాపు  అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి.  చివరి అర్ధగంటలో పుంజుకున్న కొనుగోళ్లతో  సెన్సెక్స్‌ 52900, నిఫ్టీ 15850కి ఎగిసాయి.  చివరకు 395 పాయింట్లు పెరిగి 52880 వద్ద,నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 15834 వద్ద స్థిర పడ్డాయి.  ఐటీ, ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిసాయి. టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌టీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌,  ఐసీఐసీఐ , డిష్‌టీవీ, హీందాల్కో, ఐషర్‌ మోటార్స్‌, సెయిల్ లాభపడ్డాయి.  మరో వైపు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టెక్‌, డా.రెడ్డీస్‌, సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 26 పైసలు పెరిగి 74.48 కు చేరుకుంది. బ్రిటానియీ, బీపీసీఎల్‌, సిప్లీ, విప్రో, హెచ్‌సీఎల్‌ నష్టపోయాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top