అవసరాలకు తగ్గ ప్రణాళిక.. ఆర్‌బీఐ | Restructuring of RBI Currency Management | Sakshi
Sakshi News home page

అవసరాలకు తగ్గ ప్రణాళిక.. ఆర్‌బీఐ

Sep 16 2024 7:37 AM | Updated on Sep 16 2024 9:44 AM

Restructuring of RBI Currency Management

ఆర్‌బీఐ కరెన్సీ నిర్వహణ పునర్నిర్మాణం

వచ్చే 4–5 ఏళ్లలో అమలు

న్యూఢిల్లీ: కరెన్సీ నిర్వహణ సదుపాయాలను వచ్చే 4–5 ఏళ్లలో సంపూర్ణంగా పునర్‌నిర్మించాలని ఆర్‌బీఐ ప్రణాళికతో ఉంది. ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధితో భవిష్యత్తులో ఏర్పడే కరెన్సీ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, స్టోరేజ్‌ (నిల్వ) వసతులు మెరుగుపరుచుకోవాలని అనుకుంటోంది. గ్రీన్‌ఫీల్డ్‌ కరెన్సీ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, నిల్వ కేంద్రాల ఆటోమేషన్, సెక్యూరిటీ, సర్వైలెన్స్‌ వ్యవస్థల ఏర్పాటు, ఇన్వెంటరీ నిర్వహణ విధానం, కేంద్రీకృత నిర్వహణ కేంద్రం ఇవన్నీ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్ట్‌ అమలు కాలం 4–5 ఏళ్లుగా ఉంది.

కరెన్సీ నిర్వహణ వసతుల ఆధునికీకరణకు సంబంధించి కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవల కోసం ఆర్‌బీఐ ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)లకు ఆహ్వానించింది. ఈ డాక్యుమెంట్‌ను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. ‘‘గడిచిన మూడేళ్లలో చలామణిలో ఉన్న నోట్ల పెరుగుదల మోస్తరుగా ఉన్నప్పటికీ, వచ్చే దశాబ్ద కాలంలో దాని వేగం మందగించే అవకాశం ఉంది. అయినా కానీ సమీప కాలంలో వృద్ధి సానుకూలంగా ఉంటుందని విశ్లేషణ తెలియజేస్తోంది.

గడిచిన రెండు దశాబ్దాల్లో చలామణిలో ఉన్న నోట్లు చెప్పుకోతగ్గ మేర పెరిగాయి. 2023 మార్చి 31 నాటికి 136.21 బిలియన్‌ పీసుల నోట్లఉండగా, 2024 మార్చి 31 నాటికి 146.88 బిలియన్‌ పీసులకు పెరిగాయి. కాయిన్ల చలామణి సైతం ఇదే కాలంలో 127.92 బిలియన్‌ పీసుల నుంచి 132.35 బిలియన్‌ పీసులకు వృద్ధి చెందింది’’అని ఆర్‌బీఐ టెండర్‌ డాక్యుమెంట్‌ పేర్కొంది. ఈ పెరిగే అవసరాలకు తగ్గట్టు సదుపాయాలను మెరుగుపరుచుకునే క్రమంలో భాగంగా ఆర్‌బీఐ ఈవోఐలకు ఆహ్వానం పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement