ఆర్బీఐ కఠిన నిబంధనలు.. నవంబర్‌ 1 నుంచి అమలు | RBI tightens norms for cash pay outs at banks | Sakshi
Sakshi News home page

ఆర్బీఐ కఠిన నిబంధనలు.. నవంబర్‌ 1 నుంచి అమలు

Jul 25 2024 1:28 PM | Updated on Jul 25 2024 1:39 PM

RBI tightens norms for cash pay outs at banks

ముంబై: బ్యాంకుల్లో నగదు చెల్లింపు సేవలు (క్యాష్‌ పే–అవుట్స్‌) ఇక మరింత కఠినతరం కానున్నాయి. ఈ మేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై నగదు గ్రహీతల రికార్డులను రుణదాతలు తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది.

కొత్త నిబంధనలు 2024 నవంబర్‌ 1 నుండి అమలులోకి వస్తాయి. నగదు చెల్లింపు అనేది బ్యాంకు ఖాతా లేని లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల నుండి బదిలీ చేయబడే మొత్తాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన అంశం.  ఆర్‌బీఐ ’డొమెస్టిక్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌’కి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను అక్టోబర్‌ 2011 సవరించింది.

Advertisement
 
Advertisement
Advertisement