RbI Likely To Hike Repo Rate Between 35-50 Bps In September, Details Inside - Sakshi
Sakshi News home page

RBI Repo Rates:రెపోరేట్లను పెంచనున్న ఆర్బీఐ, భారం కానున్న ఈఎంఐలు

Sep 14 2022 2:05 PM | Updated on Sep 14 2022 3:58 PM

Rbi Likely To Raise The Repo Rate Between 35-50 Bps In September - Sakshi

Repo Rate Hike In September Policy: త్వరలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) తీసుకోనున్న నిర్ణయం సామాన్యులకు మరింత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేట్లను పెంచనున్నట్లు సమాచారం. 

రిటైల్ కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (సీపీఐ)ఆధారంగా ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలై లో 6.71 శాతం నుండి ఆగస్టు నాటికి 7.0 శాతం నమోదు చేసింది. పెరిగిన ద్రవ్యోల్భణానికి కారణం ఆహారం, ఇంధర పెరుగుదలే కారణమని మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 30న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జరగనుంది. ఎంపీసీ సమావేశంలో ఐదు నెలల పాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ రెపొ రేట్లు 35 - 50 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

రెపో రేటు అంటే ఏమిటి?
ఆర్బీఐ..కమర్షియల్‌ బ్యాంకులకు వడ్డీకి రుణాలు ఇస్తుంది. ఆ రుణాల్ని రెపో రేటు అని పిలుస్తారు. ఆ రెపో రేట్లు పెరగడం వల్ల  బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే పర్సనల్‌, హోం లోన్‌, వెహికల్‌ లోన్ల వడ్డీ రేట్లను పెంచుతుంది. దీంతో కస్టమర్లు బ్యాంకులకు చెల్లించే ఈఎంఐ భారం పెరగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement