ముంబై: ముడివస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా వివిధ ట్రాక్టర్ల రేట్లను పెంచుతున్నట్లు మహీంద్రా ట్రాక్టర్స్ వెల్లడించింది. ప్రాంతాలు, మోడల్స్వారీగా పెంపు ఉంటుందని, ఏప్రిల్ 8 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.
మరోవైపు, మహీంద్రా గ్రూప్లోనే భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 21 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని వివరించింది.


