రూ.21 లక్షల కోట్లకు ఇన్విట్స్‌ ఏయూఎం | InviTs eye potential to manage Rs 21 lakh cr by 2030 | Sakshi
Sakshi News home page

రూ.21 లక్షల కోట్లకు ఇన్విట్స్‌ ఏయూఎం

Dec 5 2024 6:29 AM | Updated on Dec 5 2024 6:54 AM

InviTs eye potential to manage Rs 21 lakh cr by 2030

2030 నాటికి అంచనా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మరింతగా దృష్టి పెడుతున్న నేపథ్యంలో 2030 నాటికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ల  (ఇన్విట్స్‌) నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 21 లక్షల కోట్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇది రూ.5 లక్షల కోట్లుగా ఉంది. అలాగే రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌) పోర్ట్‌ఫోలియోలోని 125 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ వచ్చే కొన్నేళ్లలో 4 రెట్లు పెరిగి 400 మిలియన్‌ చ.అ.లకు చేరనుంది.

బుధవారమిక్కడ ఈ సాధనాలపై రిటైల్‌ ఇన్వెస్టర్ల కోసం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో రీట్స్, ఇన్విట్స్‌ అసోసియేషన్ల ప్రతినిధులు ఈ విషయాలు తెలిపారు. సాధారణంగా రియల్టీ, ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెట్టాలంటే పెద్ద మొత్తం అవసరమవుతుందని, కానీ రీట్స్, ఇన్విట్స్‌ ద్వారా చాలా తక్కువ మొత్తాన్నే ఇన్వెస్ట్‌ చేసి మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు. రీట్స్‌లో కనిష్టంగా రూ. 100–400కి కూడా యూనిట్లను కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు. మైండ్‌స్పేస్‌ బిజినెస్‌ పార్క్స్‌ రీట్‌ సీఎఫ్‌వో ప్రీతి ఛేడా, హైవే ఇన్‌ఫ్రా ట్రస్ట్‌ సీఎఫ్‌వో అభిషేక్‌ ఛాజర్, నెకస్స్‌ సెలెక్ట్‌ ట్రస్ట్‌ సీఈవో రాజేష్‌ దేవ్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు. దేశీయంగా 26 ఇన్విట్స్‌ ఉండగా, లిస్టెడ్‌ రీట్స్‌ నాలుగు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement