ఉప్పు అమ్మకాల నుంచి తప్పుకున్న హిందుస్థాన్ యూనీలివర్ | Hul To Sell Annapurna, Captain Cook Brands For Rs60.4 Crore | Sakshi
Sakshi News home page

ఉప్పు అమ్మకాల నుంచి తప్పుకున్న హిందుస్థాన్ యూనీలివర్

Feb 18 2023 7:27 AM | Updated on Feb 18 2023 7:40 AM

Hul To Sell Annapurna, Captain Cook Brands For Rs60.4 Crore  - Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ ప్రధాన వ్యాపారేతర ఆటా (పిండి), ఉప్పు విభాగాల నుంచి తప్పుకుంటోంది. తమ అన్నపూర్ణ, కెప్టెన్‌ కుక్‌ బ్రాండ్‌లను సింగపూర్‌కు చెందిన ఉమా గ్లోబల్‌ ఫుడ్స్‌కి విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఈ డీల్‌ విలువ రూ. 60.4 కోట్లు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ రెండు బ్రాండ్లను దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి టర్నోవరు రూ. 127 కోట్లుగా నమోదైంది. ఇది కంపెనీ మొత్తం టర్నోవరులో ఒక్క శాతంలోపే ఉండటం గమనార్హం. సింగపూర్‌కి చెందిన రియాక్టివేట్‌ బ్రాండ్స్‌ ఇంటర్నేషనల్‌కు ఉమా గ్లోబల్‌ ఫుడ్స్‌ అనుబంధ సంస్థ.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement