ఎగుమతిదారులకు పెద్ద ఊరట | Govt to release Rs 56,027 crore to exporters for pending tax refunds | Sakshi
Sakshi News home page

ఎగుమతిదారులకు పెద్ద ఊరట

Sep 10 2021 1:23 AM | Updated on Sep 10 2021 7:45 AM

Govt to release Rs 56,027 crore to exporters for pending tax refunds - Sakshi

న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు అపరిష్కృతంగా ఉన్న పన్ను రిఫండ్‌ (తిరిగి చెల్లింపులు) రూ.56,027 కోట్ల మొత్తాన్ని విడుదల చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. 45,000 మందికి పైగా ఎగుమతిదారులకు ఈ మొత్తం ఈ ఏడాదే అందనున్నట్టు చెప్పారు. పలు ఎగుమతి ప్రోత్సాహకాల పథకాల కింద (ఎంఈఐఎస్, ఎస్‌ఈఐఎస్, ఆర్‌వోఎస్‌సీటీఎల్, ఆర్‌వోఎస్‌ఎల్, ఆర్‌వోడీటీఈపీ) ఈ మొత్తం ఎగుమతిదారులకు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. 2021–22లోనే ఇందుకు సంబంధించి చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఎగుమతులకు ఉన్న డిమాండ్‌ను చేరుకునేందుకు, నగదు ప్రవాహాలు పెరిగేందుకు ప్రభుత్వ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. ఇది రానున్న నెలల్లో బలమైన వృద్ధికి సైతం సాయపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement