‘సెబు’ ప్రాజెక్టును విక్రయిస్తున్న జీఎంఆర్‌

GMR Group to divest entire 40percent stake in Philippines Cebu airport - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫిలిప్పైన్స్‌లోని సెబు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో తనకున్న 40 శాతం వాటాను జీఎంఆర్‌ గ్రూప్‌ విక్రయిస్తోంది. అమ్మకం కారణంగా కంపెనీ రూ.1,330 కోట్లు అందుకోవడంతోపాటు రాబోయే కాలంలో నాలుగేళ్లకుపైగా ఆదాయం స్వీకరించనుంది.

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇంటర్నేషనల్‌ బీవీ, అబూటిజ్‌ ఇన్‌ఫ్రా క్యాపిటల్‌ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ రుణ భారం తగ్గించడం, అధిక రాబడి కోసం ఆస్తులను మళ్లించడంపై దృష్టి సారించడంలో భాగంగా ఈ వాటాను ఉపసంహరించుకుంటున్నట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. 2026 డిసెంబర్‌ వరకు సాంకేతిక సేవలను జీఎంఆర్‌ అందించనుంది. సెబు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టును 2014లో జీఎంఆర్‌ దక్కించుకుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top