రూపాయిపై బ్యాంకర్లతో నేడు ఆర్థిక శాఖ భేటీ | FinMin to hold meeting with stakeholders to push overseas trade in rupee | Sakshi
Sakshi News home page

రూపాయిపై బ్యాంకర్లతో నేడు ఆర్థిక శాఖ భేటీ

Sep 7 2022 10:38 AM | Updated on Sep 7 2022 10:39 AM

FinMin to hold meeting with stakeholders to push overseas trade in rupee - Sakshi

న్యూఢిల్లీ: డాలరు స్థానంలో రూపాయి మారకంలో సీమాంతర వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు సంబంధిత వర్గాలతో కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం (నేడు) సమావేశం కానుంది. విదేశీ వ్యవహారాల శాఖ, వాణిజ్య శాఖ, ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌ వర్గాలు ఇందులో పాల్గోనున్నాయి.

ఈ సమావేశానికి ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా సారథ్యం వహిస్తారు. ఎగుమతిదారులు వీలైనంత వరకూ రూపాయి మారకంలో వాణిజ్యం జరిపేలా చూడటంపై దృష్టి పెట్టాలంటూ బ్యాంకులకు ఈ భేటీలో సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం రష్యాతో భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్యంలో సింహభాగం రూపాయి మారకంలోనే సెటిల్‌ అవుతోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement