ఆ సంస్థలోని వాటాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: బీపీసీఎల్‌

Bpcl Comment On Petronet Lng Igl Stake Sale - Sakshi

న్యూఢిల్లీ: పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ఇంద్రప్రస్థ గ్యాస్‌(ఐజీఎల్‌)లో గల వాటాల విక్రయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ప్రభుత్వ రంగ దిగ్గజం బీపీసీఎల్‌ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌లో మెజారిటీ వాటా విక్రయ సన్నాహాల్లో ఉన్న నేపథ్యంలో కంపెనీ తాజా వివరణ ఇచ్చింది.

బీపీసీఎల్‌ను సొంతం చేసుకోనున్న కొత్త ప్రమోటర్‌ పెట్రోనెట్, ఐజీఎల్‌ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మినహాయింపును కోరామని, స్పందన వెలువడవలసి ఉన్నదని కంపెనీ సీఎఫ్‌వో వీఆర్‌కే గుప్తా పేర్కొన్నారు.  బీపీసీఎల్‌కు ఐజీఎల్‌లో 22.5 శాతం, పెట్రోనెట్‌లో 12.5%చొప్పున వాటాలు న్నాయి. ఈ 2 కంపెనీలకూ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం బీపీసీఎల్‌లోగల 52.98 శాతం వాటాను డిజిన్వెస్ట్‌ చేస్తున్న విషయం విదితమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top