
ఆల్బెండజోల్తో నులిపేద్దాం..
నూరు శాతం సక్సెస్కు..
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లల కోసం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన ముందస్తుగా ఇంటింటి సర్వే నిర్వహించగా మొత్తం 3,11,317 మంది ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించేలా 3.30 లక్షల మాత్రలు సిద్ధం చేసి ఇప్పటికే అన్ని కేంద్రాలకు పంపిణీ చేశారు. నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నూరు శాతం అమలయ్యేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి అంగన్వాడీలు 1,840 మంది, మెడికల్ అండ్ హెల్త్ వర్కర్లు 1,260మంది, ఆశాలు 1,339. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 1,750 మంది సిబ్బందిని నియమించింది. ఒకవేళ నేడు(సోమవారం) మిస్ అయిన పిల్లలకు ఈ నెల 18న మాప్అప్ రౌండ్ నిర్వహించనున్నారు.
మాత్రలు మింగించే విధానం, జాగ్రత్తలు..
● 1 నుంచి 19 ఏళ్ల లోపు బాలబాలికలకు ఆల్బెడజోల్ మాత్రలు వేయనుండగా.. 1 నుంచి 2 ఏళ్ల చిన్నారులకు అర(1/2) మాత్రను రెండు చెంచాలతో పొడి(క్రష్) చేసి నీటితో మింగించాలి.
● 2 నుంచి 3 ఏళ్ల చిన్నారులకు పూర్తి(ఫుల్) మాత్రను రెండు చెంచాలతో పొడి(క్రష్) చేసి నీటితో మింగించాలి.
● 3 నుంచి 19 ఏళ్ల వరకు ఉన్నవారికి ఒక మాత్ర నమిలి మింగించాలి.
● అనారోగ్య సమస్యలు, ఇతర చికిత్సలు తీసుకున్న పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రలు మింగించొద్దని, పిల్లలకు మధ్యాహ్న భోజనం అయిన అరగంట తర్వాతనే మాత్రలు మింగించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
అల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం నూరుశాతం పూర్తి చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. 1 నుంచి 19 ఏళ్ల పిల్ల లకు తప్పకుండా మాత్రలు మింగించాలి. పిల్లలు గోళ్లు కత్తిరించుకోకపోవడం, చేతులు కడకుండా భోజనం చేయటం ద్వారా పేగుల్లోకి నట్టలు చేరి ఆకలి మందగించడంతో పాటు రక్తహీతన ఏర్పడి అనారోగ్యపాలవుతారు. అలా జరగకుండా పిల్లలకు మాత్రలు వేయించి వారి కడుపులోని నులిపురుగులను అంతం చేయొచ్చు. సోమవారం మిస్ అయిన పిల్ల లకు ఈ నెల 18 ప్రత్యేక మాప్ అప్ రౌండ్ ద్వారా మళ్లీ మాత్రలు అందిస్తాం.
– డాక్టర్ చందూనాయక్,
డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఖమ్మం జిల్లా
నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు మాత్రల పంపిణీ
పిల్లల గుర్తింపునకు ఇంటింటి సర్వే
నూరుశాతం అమలయ్యేలా ప్రణాళికలు
మిస్ అయిన వారికి 18న మాప్ అప్ రౌండ్
నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లల కోసం సోమవారం జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నులిపురుగుల మూలంగా చిన్నారుల్లో రక్తహీనత ఏర్పడి వివిధ రకాల వ్యాధుల గురవుతున్న నేపథ్యాన ప్రభుత్వం పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమం చేపట్టింది. ఇందుకు అంగన్వాడీ, విద్యాశాఖ సమన్వయంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన అన్ని ఏర్పాట్లు చేసింది. అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలకు మాత్రలు మింగించేలా సిబ్బందికి సైతం శిక్షణ ఇచ్చారు. అలాగే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీ, అర్బన్హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. – ఖమ్మంవైద్యవిభాగం
ఖమ్మం జిల్లాలో వివిధ కేంద్రాల్లో ఉన్న చిన్నారుల వివరాలు..
అంగన్వాడీ కేంద్రాల్లో (1 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు) – 74,641
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల పిల్లలు – 95,276
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు – 6,040
ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థులు – 1,35,360

ఆల్బెండజోల్తో నులిపేద్దాం..