విజ్ఞాన్‌, ఇప్సైటీ మధ్య అవగాహన ఒప్పందం | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన్‌, ఇప్సైటీ మధ్య అవగాహన ఒప్పందం

Dec 13 2025 7:43 AM | Updated on Dec 13 2025 7:43 AM

విజ్ఞాన్‌, ఇప్సైటీ మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్‌, ఇప్సైటీ మధ్య అవగాహన ఒప్పందం

చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ, గుంటూరులోని ఇప్సైటీ డయాగ్నస్టిక్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ల మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరిందని వైస్‌ చాన్స్‌లర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఇప్సైటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి కోగంటి, సీఈవో–సీఎస్‌వో డాక్టర్‌ సందీప్‌ కుమార్‌ నాదెండ్ల విజ్ఞాన్‌ వైస్‌ చాన్సలర్‌ పి నాగభూషణ్‌లు అవగాహన పత్రాలను మార్చుకున్నారు. వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ మాలిక్యులర్‌ డయాగ్నస్టిక్స్‌, ప్రెసిషన్‌ మెడిసిన్‌, ఆధునిక జీవసాంకేతిక రంగాలలో శాసీ్త్రయ, సాంకేతిక సహకారాన్ని పెంపొందించేందుకు ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం రెండు సంస్థలు కలిసి నెక్ట్స్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌, డ్రగ్‌ ఇంటరాక్షన్‌ల విశ్లేషణ, మాలిక్యులర్‌ రీసెర్చ్‌, లో–కాస్ట్‌ పీసీఆర్‌ టెక్నాలజీ అభివృద్ధి, సెప్సిస్‌ ట్రాన్స్‌క్రిప్టోమిక్స్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌ అనాలిటిక్స్‌ వంటి ఆధునిక పరిశోదనరంగాల్లో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఇప్సైటీ సంస్థ స్టేట్‌–ఆఫ్‌–ది–ఆర్ట్‌ ప్రయోగశాలలు, హైఎండ్‌ పరికరాలు, బయోఇన్ఫర్మాటిక్స్‌ సపోర్ట్‌, క్లినికల్‌ డేటా ఇంటిగ్రేషన్‌ వంటి సౌకర్యాలను అందిస్తుందన్నారు. వీటితోపాటు యూజీ –పీజీ విద్యార్థులకు పరిశోధన ఇంటర్న్‌షిప్‌లు, సంయుక్త పరిశోధన ప్రతిపాదనలను జాతీయ–అంతర్జాతీయ ఫండింగ్‌ ఏజెన్సీలకు సమర్పించడం, ఇప్సైటీ సంస్థ ఉద్యోగులకు విజ్ఞాన్‌లో ఉన్నత చదువులకు అవకాశాలు, అధ్యాపకులకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, అంతర్జాతీయ సదస్సులు, సింపోజియాలు, సంయుక్త శాసీ్త్రయ పత్రాల ప్రచురణ, ఇన్నోవేషన్‌, స్టార్టప్‌–ఇకోసిస్టంపై సంయుక్త కార్యక్రమాలు, హెల్త్‌కేర్‌–లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో ఇండస్ట్రీ–అకాడమియా బ్రిడ్జ్‌ బలోపేతం చేస్తామన్నారు. రెండు సంస్థల సహకారం వలన ఆరోగ్య సేవల మెరుగుదల, ఖచ్చితమైన రోగ నిర్ధారణ, ప్రెసిషన్‌ థెరపీ అభివృద్ధి, తక్కువ ఖర్చుతో అధునాతన పరీక్షలు అందించడంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని వీసీ తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు, వివిధ విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, పరిశోధకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement