జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌ | Ys Jaganmohan Reddy Strongly Condemned Pahalgam Terror Attack | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని ఖండించిన వైఎస్‌ జగన్‌

Apr 22 2025 9:07 PM | Updated on Apr 23 2025 2:42 PM

Ys Jaganmohan Reddy Strongly Condemned Pahalgam Terror Attack

తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

జమ్మూకశ్మీర్‌ దుర్ఘటనపై వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘పహెల్‌ గామ్‌లో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యా. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

టూరిస్టులపై కాల్పులు
మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌ నాగ్‌ జిల్లా పహెల్‌ గామ్‌లో బైసరీన్‌ వ్యాలీని వీక్షించేందుకు వచ్చిన టూరిస్టులను ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారు. ఇండియన్‌ ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు ఉగ్రవాదులు ఓపెన్‌ ఏరియాలో టూరిస్టులపై పాయింట్ బ్లాంక్‌లో గన్‌పెట్టి కాల్పులు జరిపారు. ఓపెన్‌ ఏరియా కావడంతో టూరిస్టులు ఎటూ పారిపోలేకపోయారు. ముష్కరుల తూటాలకు బలయ్యారు. ముష్కరుల జరిపిన కాల్పుల్లో 27మంది టూరిస్టులు మరణించారు. పలువురు టూరిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement