
పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబానికి పరామర్శ
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నట్టు తెలిపింది.
మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతానగర్ చేరుకుంటారని, జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తాడేపల్లి బయలుదేరుతారని వెల్లడించింది.