నేడు వైఎస్సార్‌ జిల్లాకు జగన్‌ రాక | YS Jagan to Visit Kadapa District For Two Days Over YS Rajasekhar Reddy Jayanthi | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ జిల్లాకు జగన్‌ రాక

Jul 7 2025 2:37 AM | Updated on Jul 7 2025 4:16 AM

 YS Jagan to Visit Kadapa District For Two Days Over YS Rajasekhar Reddy Jayanthi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ రెండు రోజుల పాటు వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు బెంగళూరు నుంచి పులివెందుల చేరుకుని రాత్రి అక్కడి నివా­సంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.

అక్క­డ దివంగత సీఎం వైఎస్సార్‌ ఘాట్‌లో ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.

Advertisement
 
Advertisement
Advertisement