గొప్ప నాయకుడు దామోదరం సంజీవ‌య్య‌ : వైఎస్‌ జగన్‌ | YS Jagan Pays Tribute To Damodara Sanjeevaiah | Sakshi
Sakshi News home page

గొప్ప నాయకుడు దామోదరం సంజీవ‌య్య‌ : వైఎస్‌ జగన్‌

Feb 14 2025 11:23 AM | Updated on Feb 14 2025 1:47 PM

YS Jagan Pays Tribute To Damodara Sanjeevaiah

సాక్షి, తాడేపల్లి : మాజీ సీఎం దామోదరం సంజీవ‌య్య జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.

‘దేశంలోనే తొలి ద‌ళిత ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి చేప‌ట్టి..పేద ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన గొప్ప నాయ‌కుడు దామోదరం సంజీవ‌య్య‌గారు. పాల‌న‌లో కూడా త‌న‌దైన ముద్ర‌వేసి.. ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచి పోయారు. నేడు దామోదరం సంజీవ‌య్య గారి జ‌యంతి సంద‌ర్భంగా మ‌న‌స్ఫూర్తిగా నివాళులు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement