నేడు విజయవాడకు సీఎం జగన్‌ | ys Jagan Mohan Reddy vist to Vijayawada on october 21th | Sakshi
Sakshi News home page

నేడు విజయవాడకు సీఎం జగన్‌

Oct 21 2023 5:43 AM | Updated on Oct 21 2023 7:42 AM

ys Jagan Mohan Reddy vist to Vijayawada  on october 21th - Sakshi

సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు ఆయన ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంకు చేరుకుని పోలీస్‌ అమరవీరుల సంస్మరణదినం కార్యక్రమంలో పాల్గొంటారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.

ఉదయం 10.20 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి అక్కడ గవర్నర్‌ను కలిసిన అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళతారు. అక్కడ ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Advertisement
 
Advertisement
Advertisement