బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది: వాసిరెడ్డి పద్మ

Woman Commission Chairman Responds on Vijayawada Minor Girl Suicide - Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ నేత వినోద్‌ జైన్‌ వేధింపులతో విజయవాడలో బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు. 'ఈ ఘటన జరగడం దురదృష్టకరం. బాలిక ఆత్మహత్య ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. టీడీపీ నేత వేధింపులే కారణమని బాలిక తన సూసైడ్‌ నోట్‌లో రాసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయి. ఘటనకు కారణమైన నిందితులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు’ అని వాసిరెడ్డి పద్మ అన్నారు. 

చదవండి: (విజయవాడ: టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top