జీఎస్టీ సందేహాల నివృత్తికి నేడు వెబినార్‌ 

Webinar today for resolving GST doubts - Sakshi

సాక్షి, అమరావతి: ‘జీఎస్టీ రిజిస్ట్రేషన్‌–రివోకేషన్‌’ అనే అంశంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ పేయర్‌ సర్వీసెస్‌ మంగళవారం వెబినార్‌ నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణలకు సంబంధించి అంశాలపై ఈ వెబినార్‌ను నిర్వహించనున్నారు. కేంద్ర కస్టమ్స్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌కే రహమాన్‌ జీఎస్టీకి సంబంధించిన అంశాలపై ప్రసంగిస్తారు. అనంతరం వ్యాపారుల సందేహాలకు ఆయన సమాధానాలిస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే వెబినార్‌లో పాల్గొనేందుకు క్లిక్‌ చేయాల్సిన లింక్‌: http//dgts.webex.com.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top