కరోనా విషాదం: వలంటీర్లే ఆ నలుగురై | Volunteers conducted the funeral to the man dead with corona | Sakshi
Sakshi News home page

కరోనా విషాదం: వలంటీర్లే ఆ నలుగురై

May 4 2021 4:14 AM | Updated on May 4 2021 11:17 AM

Volunteers conducted the funeral to the man dead with corona - Sakshi

మృతదేహాన్ని మరుభూమికి తరలిస్తున్న వలంటీర్లు

పిఠాపురం: నలుగురూ ఉన్నా ఆ మృతదేహానికి అంత్యక్రియలు జరిపించలేని పరిస్థితుల్లో గ్రామ వలంటీర్లే ఆ నలుగురై మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన తలాటం కొండయ్య అనే వ్యక్తి కరోనా బారినపడి సోమవారం మరణించాడు. అతని కుటుంబ సభ్యులు, బంధువులకు సైతం కరోనా సోకడంతో వారెవరూ బయటకురాలేని పరిస్థితి ఏర్పడింది.

ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటివద్దే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామ వలంటీర్లు మోర్త రవి, స్వామిరెడ్డి శివ కామేశ్వరరావు, విజ్జపురెడ్డి నాగేంద్ర, సామాజిక కార్యకర్త స్వామిరెడ్డి బుజ్జి చలించిపోయారు. పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు జరిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. మృతదేహాన్ని పంచాయతీకి చెందిన రిక్షాపై మరుభూమికి తరలించి తమ సొంత ఖర్చులతో అంత్యక్రియలు పూర్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement