Two Days Rain Forecast For Coastal Andhra And Rayalaseema - Sakshi
Sakshi News home page

గాలిలో తేమ ఎఫెక్ట్‌.. కోస్తా, సీమలో రెండు రోజులు వర్షాలు

Dec 13 2022 2:50 AM | Updated on Dec 13 2022 12:30 PM

Two Days Rain Forecast For Coastal Andhra And Rayalaseema - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మాండూస్‌ తుపాను తీరాన్ని దాటి మూడు రోజులవుతున్నా రాష్ట్రంలో ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వానలు కురు­స్తూనే ఉన్నాయి. గాలిలో తేమ అధికంగా ఉండడం వల్ల వర్షాలు కొనసాగడానికి దోహదం చేస్తున్నాయని వాతా­వరణ నిపుణులు చెబుతు­న్నారు. 

ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, వైఎస్సార్, గుంటూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో గాలిలో తేమ 90–95% నమో­దవు­తోంది. అందువల్లే ప్రస్తుతం అల్పపీడ­నాలు, ఆవర్తనాలు వంటివి లేకపో­యినా రాష్ట్రం­లోని ఇతర ప్రాంతాలకంటే ఆయా చోట్ల వానలు ఇంకా కురుస్తున్నాయి. మరో­వైపు రాష్ట్రంపైకి ఈశాన్య/తూర్పు గాలులు వీస్తు­న్నాయి. కొద్ది­రోజులకంటే ప్రస్తు­తం వీటి వేగం తగ్గింది. 

ఇలా ఈ గాలుల వేగం, గాలిలో తేమ తగ్గితే వాతా­వరణంలో పొగమంచు ఏర్పడు­తుంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయల­సీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేది­కలో తెలిపింది. కాగా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు  పలు­చోట్ల వర్షాలు కురిశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement