తల్లడిల్లి తనువు చాలించింది | Tragedy In Krishna District Avanigadda | Sakshi
Sakshi News home page

తల్లడిల్లి తనువు చాలించింది

Jul 27 2020 4:00 AM | Updated on Jul 27 2020 4:00 AM

Tragedy In Krishna District Avanigadda - Sakshi

హైమావతి (పైల్‌)

నాగాయలంక(అవనిగడ్డ): పాపం.. ఆ తల్లి గుండె తల్లడిల్లింది.. బిడ్డను కరోనా బలితీసుకున్నా అయిన వారు అక్కరకు రాలేదు.. ఇంట్లోనే 16 గంటల పాటు కుమారుడి మృతదేహం ఉన్నా వారు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు ఆ మాతృ హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. అంతే  కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లా నాగాయలంకలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ చల్లా కృష్ణ కథనం మేరకు..  

► తలశిల హైమావతి(62) కుమారుడు(42) కరోనాతో ఈ నెల 23న మృతి చెందాడు.  
► బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు చొరవతో ఎస్‌ఐ కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్‌ బి.సుబ్బారావు, సామాజిక కార్యకర్తలు తలశిల రఘుశేఖర్, కనిగంటి వెంకటనారాయణతో పాటు హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సొసైటీ సభ్యులు ఆ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.  
► ఈ ఘటన ఆ తల్లి హృదయాన్ని తల్లడిల్లేలా చేసింది. అదే రోజు ఉదయం కోడలికి చేసిన టెస్ట్‌లో పాజిటివ్‌ రావడం, అయిన వారి పలుకరింపు కరువవడంతో ఆ అమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది.  
► ఉదయం నుంచి హైమావతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఆదివారం సాయంత్రం టి.కొత్తపాలెం శివారు మరియపురం వద్ద కృష్ణానదిలో హైమావతి మృతదేహం బయట పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement