టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌ | top10 telugu latest news evening headlines 21st November 2022 | Sakshi
Sakshi News home page

టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

Nov 21 2022 4:52 PM | Updated on Nov 21 2022 5:48 PM

top10 telugu latest news evening headlines 21st November 2022 - Sakshi

1. నరసాపురం చరిత్రలో ఇదే మొదటిసారి: సీఎం జగన్‌
నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదని, దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జోక్యం చేసుకునేందుకు సుప్రీం విముఖత
 టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. చంద్రబాబుకు భయం మొదలైంది: సీఎం జగన్‌
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీసేనగా మార్చేశారని మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కొండాపూర్‌లో మంత్రి పీఏ కొడుకు ఆత్మహత్య.. కారణం అదేనా?
హైదరాబాద్‌ నగరంలోని కొండాపూర్‌ సెంటర్‌ కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. మృతి చెందిన వ్యక్తిని అక్షయ్‌గా పోలీసులు గుర్తించారు. 
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. పవర్‌ ఆఫ్‌ సోషల్‌ ‘మీడియా’.. ఆ సామాన్యుడి ‘మొరుగుడు’ నిరసన ఫలించింది
సోషల్‌ మీడియా నుంచి మీడియాకు ఎక్కిన ఆ సామాన్యుడి నిరసనకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ‘భౌ.. భౌ..’అంటూ బాధితుడు చేసిన పనికి.. అధికార యంత్రాంగం దిగొచ్చింది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. కేంద్రం బాటలో సుప్రీంకు కాంగ్రెస్‌!.. లేట్‌ రియాక్షన్‌పై చర్చ
రాజీవ్‌ దోషుల విడుదలను భావోద్వేగ రాజకీయ సమస్యగా మల్చుకునేందుకు బీజేపీ-కాంగ్రెస్‌లు ప్రయత్నిస్తున్నాయా?. మాజీ ప్రధాని హత్య కేసులో నిందితుల ముందస్తు విడుదలను పునపరిశీలించాంటూ.  
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఇండోనేషియాలో భారీ భూకంపం.. 44 మంది మృతి
ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. భారీ ఎత్తున మహిళా ఉద్యోగుల తొలగింపు, ట్విటర్‌ ఆఫీస్‌ ఫోటోలు వైరల్‌
ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ నిర్ణయాలు ఆ సంస్థ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో సగం మందిపైగా ఉద్యోగుల్ని తొలగించారు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌
తమిళనాడు స్టార్‌ ఆటగాడు నారాయణ్ జగదీశన్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో సెంచరీల మోత మోగిస్తున్నాడు.
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. చిరంజీవిని అభినందించిన మోదీ.. తెలుగులో ట్వీట్‌
టాలీవుడ్ ‍అగ్ర నటుడు చిరంజీవికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ మెగాస్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.  
పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement