రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ తేదీల్లో విజయవాడ పరిధిలో పలు రైళ్లు రద్దు | South Central Railway Cancels and Reschedules Trains in Andhra Pradesh – Check Details | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఈ తేదీల్లో విజయవాడ పరిధిలో పలు రైళ్లు రద్దు

Sep 17 2025 4:58 PM | Updated on Sep 17 2025 5:04 PM

SCR cancelled or rescheduled these trains in AP Vijayawada Details

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో విజయవాడ  పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. మరికొన్నింటికి రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగవచ్చని తెలిపింది. వీటిలో ప్రధానంగా గుంటూరు-విశాఖ మధ్య నడిచే రైళ్లే ప్రధానంగా ఉన్నాయి. 

దసరా నేపథ్యంలో.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. అయితే పండుగ తర్వాతే ఈ అంతరాయం ఉంటుందని తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. విజయవాడ డివిజన్‌ పరిధిలో విజయవాడ-దువ్వాడ నూతన బ్రిడ్జిల నిర్మాణ పనుల వల్లే ఈ అంతరాయం అని తెలిపింది.

రాజమండ్రి-విశాఖ మధ్య ప్రయాణించే రైలు నంబర్ 67285 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రికి ప్రయాణించే రైలు నంబర్ 67286 ను కూడా నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17239(సింహాద్రి ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 24 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి గుంటూరుకు ప్రయాణించే రైలు నంబర్ 17240 (సింహాద్రి ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 23 నుంచి 25 వరకూ రద్దు చేశారు.

కాకినాడ పోర్టు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17267ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి కాకినాడ పోర్టుకు ప్రయాణించే రైలు నంబర్17268 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. విశాఖ నుంచి విజయవాడకు ప్రయాణించే రైలు నంబర్ 12717 (రత్నాచల్ ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విజయవాడ నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 12718 (రత్నాచల్ ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. వీటితో పాటు.. 
 
సీఎస్ఎంటీ ముంబై నుంచి భువనేశ్వర్ కు ప్రయాణించే రైలు నంబర్ 11019ను నవంబర్ 21న 180 నిమిషాల పాటు ఆలస్యంగా రీషెడ్యూల్ చేశారు. ధన్ బాద్ నుంచి అలప్పుజకు వెళ్లే రైలు నంబర్ 13351ను నవంబర్ 24న 180 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేశారు. అలాగే హతియా నుంచి ఎర్నాకుళం వెళ్లే రైలు నంబర్ 22837ను కూడా 160 నిమిషాల పాటు రీషెడ్యూల్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement