ఎస్వీయూలో నకిలీ ఇ- మెయిల్స్‌ కలకలం

Sri Venkateswara University Officials Complaint Police Over Fake Emails - Sakshi

సాక్షి, తిరుపతి: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లో నకిలీ ఇ-మెయిల్స్‌ ఘటన కలకలం రేపింది. డబ్బు కావాలంటూ వివిధ విభాగాల ప్రిన్సిపల్స్‌ పేరిట అధ్యాపకులకు మెయిల్స్‌ రావడం గందరగోళానికి దారి తీసింది. అనుమానం వచ్చిన అధ్యాపకులు ప్రిన్సిపల్స్‌కు కాల్‌ చేసి విషయం గురించి ఆరా తీశారు. డబ్బు కోసం తామెవరికీ మెయిల్స్‌ పంపలేదని వారు స్పష్టం చేయడంతో.. ఇవన్నీ నకిలీ మెయిల్స్‌ అని తేలింది. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (పేరుకు పెద్ద సాయం.. కానీ, అంతా మోసం) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top