
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో యోగా డే సందర్భంగా విద్యార్థులు అవస్థలు పడ్డారు. సమయానికి తిండిలేక ఆకలితో అలమటించారు. అర్ధరాత్రి పస్తులతోనే గిరిజన విద్యార్థులు పడుకున్నారు భోజనాలు సరిపోక.. ఆకలి కేకలతో హాహాకారాలు చేశారు. గిరిజన విద్యార్థులను పట్టించుకోలేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. యోగా కోసం తీసుకెళ్లి కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు.

కాకినాడ జిల్లాలో కూడా యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఆకలి బాధలు పడ్డారు. పిఠాపురం, సామర్లకోట ప్రభుత్వ పాఠశాలల్లో యోగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు నాసిరకం ఆహరం, అల్పాహారం సరఫరా చేశారు. జావ మాదిరిగా ఉన్న ఉప్మాను తినలేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం అన్నం, సాంబారు భోజనం సరఫరా చేశారు. కొందరు విద్యార్థులు భోజనం తినలేక ఆకలితో అలమటించారు.

విద్యార్థులకు సరఫరా చేసిన ఆహారాన్ని పరిశీలించిన మానవ హక్కుల సంఘం నేతలు, విద్యా కమిటీ సభ్యులు.. పాఠశాల ఉపాధ్యాయులపై మండిపడ్డారు. నాసికరం ఆహారం సరఫరా చేసిన బెండపూడికి చెందిన అల్లూరి సీతారామరాజు ట్రస్ట్పై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
