ఏపీ వ్యాప్తంగా పలు ప్రముఖ ఆలయాల వైబ్సైట్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. తిరుమల, శ్రీశైలంకు సంబంధించిన దేవస్థానాల వైబ్సైట్ సర్వర్లు సాంకేతిక సమస్యతో స్తంభించిపోయాయి. దీంతో ఆన్లైన్ టికెట్ల జారీ నిలిచిపోయింది.తిరుమలలో ఆఫ్లైన్లో టికెట్ల జారీ చేపడుతున్నారు. సర్వర్ల సమస్యతో టికెట్ల జారీ నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


