కోవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షలు | Rs 5 lakh to families of journalists deceased with Covid | Sakshi
Sakshi News home page

కోవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5 లక్షలు

Mar 18 2021 5:41 AM | Updated on Mar 18 2021 5:41 AM

Rs 5 lakh to families of journalists deceased with Covid - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వల్ల మృతి చెందిన జర్నలిస్టులపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రిడిటేషన్‌ ఉన్న జర్నలిస్టులకు ఈ పరిహారం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దీనిపై నిర్ణయం తీసుకోగా.. బుధవారం ఉత్తర్వులిచ్చింది. కాగా, జర్నలిస్టుల కుటుంబాలకు పరిహారం అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు జర్నలిస్టు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement