గిరిజనుల గుండె చప్పుడు సీఎం జగన్‌  | Rajanna Dora On CM Jagan For Welfare Schemes Tribals | Sakshi
Sakshi News home page

గిరిజనుల గుండె చప్పుడు సీఎం జగన్‌ 

Nov 16 2022 4:20 AM | Updated on Nov 16 2022 5:00 AM

Rajanna Dora On CM Jagan For Welfare Schemes Tribals - Sakshi

విల్లు ఎక్కుపెట్టిన రాజన్న దొర

బీచ్‌ రోడ్డు (విశాఖ తూర్పు): దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గిరిజనుల అభివృద్ధి కోసం అనేక పథకాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తూ వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ బిర్సా ముండా జయంతి సందర్భంగా మంగళవారం విశాఖలో గిరిజన గౌరవ దిన వారోత్సవాలను రాజన్నదొర ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనులకు 2 లక్షల పుడక భూములను పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. గిరిజన నాయకులు, సమరయోధుల గురించి, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు గిరిజన కార్నివాల్‌ను ప్రారంభించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నృత్యాలు చేస్తూ సాగర తీరాన్ని హోరెత్తించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, భాగ్యలక్ష్మి, కళావతి, జీసీసీ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement