
సాక్షి, అన్నమయ్య: జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగినేని మణిపై ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. పత్తి రాజేశ్వరి అనే మహిళపై దాడి చేసిన ఘటనకు సంబంధించి.. బాధితురాలి ఫిర్యాదుతో ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితమ శ్రీరామనవమి రోజున జోగినేని మణి.. చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన మహిళ రాజేశ్వరిని కాళ్లతో తన్ని దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు గురిచేశాడు. అనంతరం, పత్తి రాజేశ్వరిపై దాడి చేశాడు. ఈ సందర్భంగా మణి.. తనకు పవన్ కల్యాణ్, హోం మంత్రి అందరూ తెలుసు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ చులకన చేసి మాట్లాడాడు. దీంతో, మణి వల్ల తనకు ప్రాణహాని ఉంది బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో, ఆనాడు పోలీసులు ఫిర్యాదు చేయగా.. ఇప్పటికి ఓబులవారిపల్లె పోలీసులు జోగినేని మణిపై కేసు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, అంతకుముందు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను విమర్శించాడంటూ పోసాని కృష్ణమురళిపై మణి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అతని ఫిర్యాదు మేరకు అప్పట్లో ఆఘమేఘాలపై పోసానిని అరెస్టు చేశారు పోలీసులు. తాజాగా మణి అరాచకాలను బాధితురాలు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.