Andhra Pradesh-Ration Card: దరఖాస్తు చేసిన మూడు గంటల్లోనే రేషన్‌ కార్డు!

New Ration‌ Card Within Three Hours In Vizianagaram District - Sakshi

మెరకముడిదాం: విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలోని గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఇజ్జిరోతు సూర్యనారాయణ రేషన్‌కార్డు కోసం గ్రామ సచివాలయంలో శనివారం మధ్యాహ్నం 1 గంటకు దరఖాస్తు చేసుకున్నాడు.  పంచాయతీ కార్యదర్శి ఎం.స్వర్ణలత లబ్ధిదారుడికి సాయంత్రం 4 గంటలకల్లా రేషన్‌కార్డు అందజేయడంతో ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. దరఖాస్తు చేసిన 3 గంటల వ్యవధిలోనే కార్డు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:
సబ్‌ రిజిస్ట్రార్‌ లీలలు: ‘ఆచారి’ అక్రమాల యాత్ర 
వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభుత్వం సేవలు.. దేశంలోనే నంబర్‌ వన్‌

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top