
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కోటితీర్థం గ్రామ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం మధుసూదన్రావు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసనతో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయనను సాక్షి పలుకరించగా తన రాజీనామాకు దారితీసిన ఆవేదనా భరిత అంశాలను విశదీకరించారు. ఇంటర్వ్యూ
వివరాలు ఇలా...
రాజీనామా చేసేందుకు కారణం ఏమిటి?
విద్యాబుద్ధులు నేర్పి భావితరాలకు ఉత్తమ పౌరులను అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం చదువుకు సంబంధంలేని పలు రకాల యాప్లు ఉపాధ్యాయులపై రుద్ది వాటికి సమాధానాలు సకాలంలో ఇవ్వకపోతే మెమోలు ఇస్తోంది. దీంతో వృత్తి పట్ల అంకితభావంతో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడి ఏర్పడి రాజీనామా ఇచ్చేశా.
తదుపరి ఏమి చేయనున్నారు?
యాప్లతో విసిగి వేసారిన ఎందరో ఉపాధ్యాయులు వారి కష్టాలను బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎవరో ఒకరు ఈ విషయాన్ని ఎదిరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అందుకే ఈ చిన్న ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో రాజీనామా సమర్పించాను. సమస్యలపై ప్రజలను, ఉపాధ్యాయులను చైతన్య పరిచేందుకు ఉద్యమం చేస్తా.
అందరిదీ ఇదే పరిస్థితా?
యాప్లతో చదువుకు సంబంధంలేని ఇతర పనులకు సమయం కేటాయించలేక అంకితభావంతో వృత్తి బాధ్యతలు నిర్వర్తించలేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. ఉపాధ్యాయులకు స్వేచ్ఛ ఇవ్వండి. నాణ్యమైన విద్యను రాబట్టండి అని మేము చెప్పేందుకు స్వేచ్ఛలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపు 90 శాతానికిపైగా ఉపాధ్యాయులది ఇదే పరిస్థితి.
ప్ర: వృత్తి పట్ల సంతృప్తి ఎలా ఉంది?
నేను గత మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. గతంలో ఎన్నడూలేనంత ఒత్తిడి ఈ ప్రభుత్వంలోనే అనుభవించా. విసిగి వేసారి రాజీనామా చేశా. చేస్తున్న వృత్తికి న్యాయం చేయలేకపోవడం, ఉద్యోగిగా సంతృప్తి లేని పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కువైంది. దీంతో నాలాంటి వారిని తోడు చేసుకొని ఉపాధ్యాయులను మేలుకొలుకొలిపేందుకు ఈ ప్రయత్నం ప్రారంభిస్తున్నా.
పాఠశాలలు ఎలా ఉన్నాయి?
గత ప్రభుత్వ కాలంలో పట్టణాలతో పాటు మారుమూల పల్లెల్లో సైతం ప్రభుత్వ పాఠశాలల భవనాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి. రెండు దశల్లో చేసిన ఈ అభివృద్ధి పనుల్లో పాఠశాలల్లో అనేక మౌలిక వసతులు ఏర్పడి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జరిగాయి. ఆధునిక చదువు పల్లెలకు వచి్చందని గట్టిగా చెప్పవచ్చు. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా ఉపాధ్యాయులను మాత్రం బొమ్మల్లా ఆడుకుంటున్నారు.
ఎవరైనా చెబితే విరమించుకుంటారా?
ప్రభుత్వ విధానాలపై విసిగివేసారి వృత్తికి న్యాయం చేయలేకపోతున్నానన్న మానసిక క్షోభతో రాజీనామా చేశా. ఎట్టి పరిస్థితిలోనూ రాజీనామాకు కట్టుబడి ఉన్నా. ఉద్యమం చేపట్టి ఉపాధ్యాయులను చైతన్య పరిచేందుకు కృషి చేస్తా.
యాప్లతో వచి్చన ఇబ్బంది ఏమిటి?
వృత్తికి న్యాయం చేయలేక ఓవైపు ఇబ్బందులు పడుతున్నాం. యాప్లు పనిచేయక, హాజరు సరైన సమయానికి ఆన్లైన్లో నమోదు చేయలేక తీవ్ర వేదనకు గురవుతున్నాం. ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫోన్లు చేస్తూ పాఠశాలకు హాజరయ్యారా లేదా అంటూ అనుమానంతో ప్రశి్నస్తున్నారు. దీనితో ఏ తప్పు చేయక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. నెట్వర్క్ సరిగాలేక యాప్లు పనిచేయకపోతే మేమెందుకు శిక్ష అనుభవించాలి? సంబంధిత నెట్వర్క్ ఉద్యోగులను ప్రశి్నంచాలి? లేదా దాని కెపాసిటీని పెంచాలి. మాపై ఒత్తి చేస్తే మేమేమి చేస్తాం? యాప్లు పెట్టడం తప్పుకాదు. వాటిని సక్రమంగా పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తప్పు.
బదిలీలు ఎలా జరిగాయి?
ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ ఉన్న క్రమంలో బదిలీల్లో చాలా అన్యాయాలు జరిగాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఉపాధ్యాయ కౌన్సెలింగ్ రాత్రిళ్లు జరగడం బాధాకరం. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి విఫలం అయ్యారు. బదిలీలలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బదిలీలు అయిన వారికి రిలీవ్కు అవకాశం ఇవ్వకపోవడం దారుణం. బదిలీల్లోనూ వివాదాలు, అక్రమాలు చోటు చేసుకున్నాయి.
బాత్రూముల ఫొటోల విషయం ఏమిటి?
మూడు నెలల క్రితం పాఠశాలల్లోని బాత్రూముల ఫొటోలు వెంటనే అప్లోడ్ చేయాలని ఓ యాప్ను సృష్టించారు. దానిని కొందరు ఉపాధ్యాయులు సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఆలస్యమైనందుకు మెమోలు ఇచ్చారు. ఉపాధ్యాయులకు బాత్రూముల ఫొటోలు తీయమని పనులు అప్పగించడమేమిటి?
యోగాపై మీ అభ్యంతరాలు ఏమిటి?
యోగాపై నాకెలాంటి అభ్యంతరాలు లేవు.యోగా మంచిదే. కేవలం ఉపాధ్యాయులు, విద్యార్థుల ద్వారా యోగాను ప్రమోట్ చేసి ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకోవడం సరికాదు. 6, 7 సంవత్సరాల చిన్నారులను, పాఠశాలలకు ఎంతో దూరంలో నివసిస్తూ ఉండే మహిళా ఉపాధ్యాయులను ఉదయం 6 గంటలకే పాఠశాలలకు వచ్చి యోగాలో పాల్గొనాలని ఒత్తిడి చేయడం దారుణం. ఇది నచ్చక రాజీనామా పత్రంలో విమర్శలు చేశా.