
సాక్షి, గుంటూరు : తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. పేకాట శిబిరాల్లో తన అనుచరులు ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. తానే పేకాట ఆడిస్తున్నానని వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని, వాటితో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. పేకాట శిబిరాల ఏర్పాటుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని పోలీసులను కోరారు.