సత్యదేవుని సన్నిధిలో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు

MLA couple visiting Annavaram Satyanarayana Swamy - Sakshi

విజయనగరం: అన్నవరం సత్యనారాయణ స్వామిని జెడ్పీ చైర్మన్‌  మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే   బడ్డుకొండ అప్పలనాయుడు, పద్మావతి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారితో పాటు నూతన వధూవరులు సిరి సహస్ర,  ప్రదీప్, ఇతర కుటుంబసభ్యులు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు.  ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు,  అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం   గర్భాలయంలో ఉన్న స్వామివారిని వారంతా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top