విషాదం మిగిల్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అదృశ్యం కేసు | Missing Software Employee Body Found At Krishna River | Sakshi
Sakshi News home page

విషాదం మిగిల్చిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అదృశ్యం కేసు

Nov 8 2024 3:23 PM | Updated on Nov 8 2024 3:31 PM

Missing Software Employee Body Found At Krishna River

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుమంత్‌ అదృశ్యం కేసు చివరికి విషాదాన్ని మిగిల్చింది.

సాక్షి, కృష్ణా జిల్లా: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుమంత్‌ అదృశ్యం కేసు చివరికి విషాదాన్ని మిగిల్చింది. అవనిగడ్డ మండలం తుగలవానిపాలెంలో ఉద్యోగి మృతదేహం లభ్యమైంది. స్నేహితుని వద్దకు వెళ్లి వస్తానని చెప్పి చల్లపల్లికి చెందిన బొడ్డు సుమంత్ ఇంటి నుంచి బయటికి  వెళ్లారు.

అయితే, రెండు రోజుల క్రితం పులిగడ్డ-పెనుమూడి వారధి పై సుమంత్ బైక్, ఫోన్, పర్సు లభ్యమయ్యాయి. కృష్ణానదిలో దూకి ఉంటాడనే అనుమానంతో రెండు రోజులుగా పోలీసులు, కుటుంబసభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. సుమంత్ మృతదేహం లభ్యం కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement