వైద్య వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారు.

మంత్రి ఆళ్ల నాని
సాక్షి, విశాఖపట్నం: గత టీడీపీ పాలనలో వైద్య వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 మెడికల్ కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.50 కోట్ల అంచనా వ్యయంతో ఒక్కో ఆసుపత్రిలో 120 పడకలు ఏర్పాటు, పాడేరు తరహాలో సీతంపేట, పార్వతీపురం ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు స్థల పరిశీలన చేస్తున్నామని ఆయన వెల్లడించారు. (చదవండి: భూ దోపిడీపై నిగ్గు తేల్చండి)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి